Monday, June 15, 2009

తాతగారి శత జయంతి...

లేటు శ్రీ రుద్రావఝల నరసింహ మూర్తిగారు... ౧౯౦౯-౨౦౦౯ (1909 - 2009)... క్లుప్తంగా ఆర్. ఎన్. మూర్తి గారు.... తెలగాణ్య అభ్యుదయ సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు... మా తాతగారు...వారి శత జయంతి 2009 కృష్ణాష్టమి నాటికి ౧౦౦ ఏళ్ళు (100 yrs) పూర్తి అవుతున్న సందర్భాన .. వారి పిల్లలు.. మనుమలు.. మునిమనుమలు.. . ఎక్కడెక్కడో వున్న వారి సంతతి అంతా కలిసి ఒక్కచోట చేరడం... తాతగార్నితలచుకోవడం... అందరూ కలసి ఆపాతమథురాలని నెమరువేసుకోవడం... విందులూ... వినోదాలూ.. గానాబజానాలూ... అంతా ఒహటే హడావిడి...
ఇప్పటికే మీకు ఉత్సాహం ఉరకలు వేస్తోందా... ఎక్కడో... ఎప్పుడో.. ఏమీ తెలుసుకోకండానే... అదేమరి... ఆఁ...ఆఁ... ఆట్టే...ఆట్టే... మీరు కుదురుగా వుంటేగాని చెప్పనంథే... హన్నా...
ఆఁ... అదీ... ఇప్పుడు చెప్తా వినండి... ఆగష్టు 14, 15వ తారీకులలో... విశాఖపట్నం పెదవాల్తేరు లో... చేసుకుంటున్నాం ... అంచేతా... మనమంతా... ఆగష్టు 14 పొద్దున్న 6:00 am కల్లా ఒళుపొచ్చీసి ఫంక్షన్ ని జయప్రదం చేస్తారని తలుస్తాము...
ఇట్లు...
ఇంకెవరు...
.....మనమే...
మనందరమూనూ...